Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 428 పాయింట్ల రికార్డు గరిష్టంతో 79,671.58 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 130 పాయింట్లు (0.53 శాతం) పుంజుకుని ఆల్ టైం హై 24,174 పాయింట్లకు దూసుకెళ్లింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 210.45 (0.27 శాతం) పాయింట్ల నష్టంతో 79,032.73 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎస్ఎస్ఈ సూచీ నిఫ్టీ 33.90 (0.14 శాతం) పాయింట్ల పతనంతో 24,010.60 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈలో రిలయన్స్, టాటా మోటార్స్ స్టాక్స్ ప్రధానంగా లాభాలార్జించగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ నష్టపోయాయి. అలాగే ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ స్టాక్స్ లాభ పడగా, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!