Stock Market Close | దేశీయ మార్కెట్ల జైత్రయాత్ర కొనసాగుతున్నది. నిన్న సరికొత్త జీవనకాల గరిష్ఠాలను చేరిన సూచీలు.. గురువారం సైతం అదే రోజును కొనసాగిస్తూ కొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారిగా 80వేల పాయింట్ల ఎగువన ముగిసింది. నిఫ్టీ సైతం గరిష్ఠ స్థాయిలో ముగిసింది. ఇదిలా ఉండగా.. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఉదయం కిత్రం సెషన్ (79,986.80)తో సెన్సెక్స్ 80,321.79 పాయింట్ల భారీ లాభాల్లో మొదలైంది. కొద్దిసేపటికే సెన్సెక్స్ 80,392.64 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని ఆల్టైమ్ హైని చేరుకున్నది. చివరి సెషన్లో 79,986.41 కనిష్ఠానికి చేరింది. స్వల్పంగా కోలుకొని 62.88 పాయింట్ల లాభంతో 80,049.67 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం క్రితం సెషన్తో పోలిస్తే 24,369.95 పాయింట్ల వద్ద భారీ లాభంతో మొదలైంది. అనంతరం 24,401 పాయింట్లకు పెరిగి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరింది. చివరకు 15.65 పాయింట్ల లాభంతో 24,302.15 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,901 షేర్లు పెరగ్గా.. 1550 షేర్లు పతనమయ్యాయి. మరో 62 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో అత్యధికంగా హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, హెల్త్కేర్ షేర్లు ఒక్కొక్కటి ఒక్కోశాతం చొప్పున పెరిగాయి. ఆటో, రియల్టీ 0.5 శాతం లాభపడ్డాయి. మీడియా ఇండెక్స్ 0.4 శాతం పతనమైంది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి.