Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల వరుస లాభాలతో గరిష్ఠానికి పెరుగుతున్న సూచీలు.. తాజాగా సరికొత్త రికార్డులను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) తొలిసారిగా 80వేల పాయింట్ల మార్క్ను దాటింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) 24వేల మార్క్ను ఆల్టైమ్ హైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలకు మార్కెట్లు దన్నుగా నిలిచాయి. దానికి తోడు బ్యాంకింగ్, వివిధరంగాల్లోని షేర్ల కొనుగోళ్ల మార్కెట్కు కలిసివచ్చింది. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,013.77 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,074.30 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది.
చివరకు 545.34 పాయింట్ల లాభంతో 79,986.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 24,291.75 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఈ క్రమంలోనే 24,309.15 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరుకొని జీవనకాల గరిష్ఠాన్ని చేరుకున్నది. చివరకు 162.65 పాయింట్లు 24,286.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,075 షేర్లు పురోగమించగా.. 1372 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి. టీసీఎస్, టైటాన్ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టార్లలో మీడియా మినహా, ఇతర అన్ని రంగాల సూచీలు పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, మెటల్ ఒకటి నుంచి 2శాతం లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు దాదాపు ఒకశాతం చొప్పున పెరిగాయి.