Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో మొదలయ్యాయి. 80వేల పాయింట్లకు చేరువైన సెన్సెక్స్.. కొద్దిసేపటికే ఒక్కసారిగా పతనమైంది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 79,840.37 పాయింట్ల భారీ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 79,855.87 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ పతనమైంది. ఇంట్రాడేలో 79,231.11 పాయింట్ల కరిష్ఠానికి చేరుకొంది. ఫలితంగా ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. చివరకు 34.73 పాయింట్ల నష్టంతో 79,441.45 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 24,236.35 పాయింట్ల వద్ద ఆల్టైమ్ హైకి చేరింది. చివరకు 18.10 పాయింట్లు తగ్గి.. 24,123.85 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,740 షేర్లు పురోగమించాయి. మరో 1,686 షేర్లు పతనం కాగా.. 72 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఎల్అండ్టీ, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎల్ లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు 0.3 శాతం నుంచి ఒకశాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, పవర్ రంగాల షేర్లు 0.3 శాతం నుంచి 0.9 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది.