Stock Market | ముంబై, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ తొలిసారిగా 79 వేల మార్క్ను అధిగమించింది. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్..చివరకు 568.93 పాయింట్లు లాభపడి 79,243.18 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం తొలిసారిగా 24 వేల మార్క్ను అధిగమించింది. చివరకు 175.70 పాయింట్లు అందుకొని 24,044.50 వద్ద స్థిరపడింది.
నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు కూడా ముగియనుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఇదే ట్రెండ్లో కొనసాగినప్పటికీ, ఆ తర్వాత అంతర్జాతీయంగా వచ్చిన సానుకూల అంశాలు ఒక్కసారిగా సూచీల్లో జోష్ అందుకున్నది. దీంతో మదుపరుల సంపద రికార్డు స్థాయికి చేరుకున్నది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయి రూ.4,38,41,960.73 కోట్లు(5.25 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.