SBI Card with Paytm | ఆన్లైన్ మోసాలను నివారించడానికి బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్బీఐ వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డు దారుల వ్యక్తిగత డేటా భద్రతకు టోకెనైజేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్.. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంతో జత కట్టింది. ఖాతాదారులు తమ కార్డుల టోకెనైజేషన్ కోసం పేటీఎంతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
ఒర్జినల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు స్థానంలో యునిక్యు క్యారెక్టర్ల (unique characters) తో టోకెన్ జారీ చేస్తాయి. ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు కస్టమర్ కార్డ్ డిటైల్స్ సెక్యూర్గా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) డివైజ్లకు మాత్రమే కార్డు టోకెనైజేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ కార్డ్స్ తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా జరిగే లావాదేవీలకు పేటీఎం నెట్వర్క్పై కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. అయితే, విదేశీ కేంద్రాల్లో పేటీఎం నెట్వర్క్ ద్వారా ఎస్బీఐ కార్డు సేవలను వాడుకోవచ్చునని వివరించింది.