న్యూఢిల్లీ, జూలై 4: రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది. నాడు రూ.22,985 కోట్లేనని గురువారం టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్ తెలియజేసింది.
ఇక భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 13.25 శాతం ఎగిసి రూ.20,951.91 కోట్లుగా నమోదైంది. నిరుడు రూ.15,500.36 కోట్లే. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ సైతం రూ.7,210.63 కోట్ల నుంచి రూ.7,370. 75 కోట్లకు పెరిగింది.
అయితే ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఏజీఆర్లు 4.41 శాతం, 13.78 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఎన్ఎల్ ఏజీఆర్ ఈ జనవరి-మార్చిలో 1,991.61 కోట్లుగా ఉంటే, ఎంటీఎన్ఎల్ది రూ.156.61 కోట్లే.