ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) గణనీయ విజయం సాధించింది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్లో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్ల మార్కును దాటేసింది. బీఎస్ఈలో రిలయన్స్ షేర్ 2.31 శాతం పుంజుకుని రూ.3,131.85 వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రాడే ట్రేడింగ్ లో రిలయన్స్ షేర్ 3.27 శాతం వృద్ధి చెంది రూ.3,161.45ల వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది.
బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ టాప్ పెర్ఫార్మింగ్ సంస్థగా నిలిచింది. మరోవైపు ఎన్ఎస్ఈలోనూ రిలయన్స్ స్టాక్ 2.19 శాతం వృద్ధితో రూ.3,128.25 వద్ద స్థిర పడింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,777.57 కోట్లు పుంజుకుని రూ.21,18,951.20 కోట్ల వద్దకు చేరుకుంది. తద్వారా భారత్ లోనే అత్యంత విలువ గల కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇప్పటి వరకూ 21.16 శాతం లబ్ధి పొందింది.
ఈ ఏడాది జనవరి 29న రూ.లక్ష కోట్లు దాటి రూ.19 లక్షల కోట్లకు చేరుకున్నది రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. తిరిగి గత ఫిబ్రవరి 13న మరో రూ.లక్ష కోట్లతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్లు క్రాస్ అయింది. 2005 ఆగస్టు నాటికి రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా రిలయన్స్ ప్రయాణం.. రూ.10 లక్షల కోట్ల మార్కును దాటడానికి 14 ఏండ్లు పట్టింది. .అంటే 2019 నవంబర్ నాటికి సంస్థ ఎం-క్యాప్ రూ.10 లక్షల కోట్ల మార్కును దాటేసింది. అక్కడి నుంచి మరో రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటేందుకు రిలయన్స్ కు నాలుగున్నరేండ్లు పట్టింది.
Reliance | రిలయన్స్ ఎం-క్యాప్ @రూ.20 లక్షల కోట్లు.. దలాల్ స్ట్రీట్లో సరికొత్త చరిత్ర..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!