న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు మరింత అధికంకానున్నాయి. అత్యధిక మంది వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.90 శాతానికి పెరగనున్నది.
అంతకుముందు ఇది 8.85 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 9.20 శాతానికి పెంచిన బ్యాంక్…నెల, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేట్లు 8.35 శాతం నుంచి 8.55 శాతం మధ్యలో సవరించింది. మరోవైపు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయిం ట్లు పెంచుతున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.