Pinnelli Rama Krishna Reddy | ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎం ద్వంసం చేసిన కేసులో అరెస్టయిన నెల్లూరు కేంద్ర కరాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండో రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది. అదనపు విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన అభ్యర్థనకు మాచర్ల కోర్టు జడ్జి అంగీకరించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తారు.
గత మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్లలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా సీహెచ్ నాగ శిరోమణి అనే మహిళ నిలదీయడంతో ఆమెను దుర్భాషలాడి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంట చింతల పోలీసులు ఐపీసీలోని 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేశారు. దీనిపైనా అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి, మరో 15 మందిపై ఐపీసీలోని 307, 147, 148, 120బీ, 324, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద రెంటచింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance | 52 వారాల గరిష్టానికి రిలయన్స్.. ఎం-క్యాప్లో మరో రికార్డు..!
Motorola Razr 50 Ultra | ప్రీమియం సెగ్మెంట్లో మరో ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ..!