New MNP rules : సిమ్ స్వాపింగ్ అక్రమాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. సాధారణంగా ఫోన్ నెంబర్ మారకుండానే నెట్వర్క్ మార్చుకోవడానికి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సదుపాయం ఉంటుంది. అయితే గంటల్లో జరిగే ఈ సిమ్ స్వాప్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ట్రాయ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ఈ కొత్త రూల్ ప్రకారం.. నెట్ వర్క్ మారాలంటే ఇకపై కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే కొత్త రూల్ ప్రకారం ఫోన్ నంబర్ పోర్టింగ్కు అర్హత పొందేందుకు ఏడు రోజులపాటు ఆగాల్సిందేనని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. సిమ్ కార్డుల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై సిమ్ కార్డ్ నెట్ వర్క్ మార్చుకునేందుకు 7 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే సిమ్ కార్డు పోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు సంబంధిత టెలికాం సంస్థలను సంప్రదిస్తే అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని కొత్త సిమ్ కార్డును జారీ చేస్తుంటారు. ఒకవేళ ఫోన్ నెంబర్ మార్చుకోకుండా నెట్ వర్క్ మార్చుకోవాలనుకున్నప్పుడు మీ ఫోన్ నుంచి PORT <మొబైల్ నంబర్> ను 1900 కు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది.
దాంతో ఆ మొబైల్ నంబర్ వినియోగదారుడికి ఒక యూనిక్ పోర్టింగ్ కోడ్ వస్తుంది. ఇతర మొబైల్ కంపెనీ నెట్వర్క్కు మారాలనుకున్నప్పుడు ఈ యూనిక్ పోర్టింగ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం సిమ్ కార్డు నెట్ వర్క్ మారడానికి వారం రోజులపాటు ఆగాల్సి ఉంటుంది.