Bombay Dyeing | ప్రముఖ వస్త్రాల సంస్థ బాంబే డయింగ్ (Bombay Dyeing).. ముంబైలో గల సుమారు 22 ఎకరాల భూమిని అమ్మేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముంబైలోని వర్లీ ప్రాంతంలో బాంబే డయింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (బీఎండీసీ)కి 22 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ‘గోయిసు రియాల్టీ (Goisu Realty)కి విక్రయించాలని నిర్ణయించింది. జపాన్ రియాల్టీ డెవలపర్ సుమిటోమో అనుబంధ సంస్థే ఈ గొయిసు రియాల్టీ. ఈ భూమిని రూ.5200 కోట్లకు విక్రయించ తలపెట్టింది. ఈ భూమి విలువలో అత్యంత పెద్ద డీల్ అని చెబుతున్నారు.
సుమిటోమోకు రెండు దశల్లో ఈ భూమిని బాంబే డయింగ్ స్వాధీనం చేయనున్నది. తొలి దశలో రూ.4,675 కోట్లు, మిగతా రూ.525 కోట్ల చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుతం బాంబే డయింగ్ రూ.3,969 కోట్ల రుణాల ఊబిలో చిక్కుకున్నది. గత ఏడాది కాలంలో రూ.900 కోట్ల రుణ వాయిదాలు చెల్లించింది. ఈ రుణభారం నుంచి బయట పడేందుకే బాంబే డయింగ్ తన విలువైన భూమిని విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. వాడియా గ్రూపు సంస్థే బాంబే డయింగ్.