GST Fraud | మోసగాళ్లు రకరకాలుగా ఉంటారు.. టెక్నాలజీ పెరగడంతో సైబర్ ఫ్రాడ్ చేసే వారు కొందరు ఉంటే.. మరి కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అధికారులను బురిడీ కొట్టిస్తుంటారు. మోసపూరితంగా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి బాబర్ ఖాన్ ఓ వ్యక్తి దొంగిలించిన, ఫొర్జ్డ్ ఐడీ కార్డుల ఆధారంగా నకిలీసంస్థలు సృష్టించాడు. అలా దేశవ్యాప్తంగా సంస్థలు తయారు చేసి రమారమీ రూ.10 వేల కోట్ల జీఎస్టీకి శఠగోపం పెట్టాడు. వేల కొద్దీ కంపెనీలు తయారు చేసి.. వాటి పేరు మీద ఈ-వే బిల్లులు రూపొందించి, ప్రభుత్వం నుంచి ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందాడు. ఈ సంగతిని నొయిడా పోలీసులు గతేడాది జూన్ ఒకటో తేదీన గుర్తించారు. జీఎస్టీ ఫ్రాడ్ ముఠా ఉందని అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, సిర్సా, జైపూర్, ఛింద్వారా ప్రాంతాల వాసులు 47 మందిని బాబర్ ఖాన్ తన ఫ్రాడ్ లో భాగస్వాములను చేశాడు.
దర్యాప్తులో సంక్లిష్టతతో నొయిడా పోలీసులు బాబర్ ఖాన్ (31) మీద రూ.25 వేల రివార్డు ప్రకటించారు. బాబర్ ఖాన్ తన మోసాలకు పేద ప్రజల ఆధార్ కార్డులను వాడుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక జర్నలిస్ట్ పాన్ కార్డు వివరాలు మోసపూరితంగా వాడుకుని రెండు కంపెనీలు సృష్టించాడు. మరో కంపెనీని సృష్టిస్తే జీఎస్టీ అధికారులు తిరస్కరించారు. చివరకు నొయిడా పోలీసులు అతడి ఇంట్లోనే బాబర్ ఖాన్ ను అదుపు చేశారు. వీరిపై ఈ నెల మూడో తేదీన గ్యాంగ్ స్టర్ చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ మోసంలో పాల్గొన్న 47 మందిలో 33 మందిని అరెస్ట్ చేశారు. 2021 నుంచి తాను ఈ గ్రూపుతో కలిసి మోసాలు చేశానని చెప్పాడు. ఎన్ని ఐడీ నంబర్లు క్రియేట్ చేశాడన్న సంగతి ఇంకా తెలియరాలేదు. గురువారం అతడ్ని నొయిడాలోని స్థానిక న్యాయస్థానం ముందు హాజరు పర్చగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!