Business News | న్యూఢిల్లీ, జూలై 1: దేశీయ మార్కెట్లో గత నెల ప్యాసింజర్ వాహన విక్రయాలు స్వల్పంగానే పెరిగాయి. నిరుడు జూన్తో చూస్తే.. ఈ ఏడాది జూన్లో మారుతీ సుజుకీ అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ వృద్ధి చెందలేదు. హ్యుందాయ్ సేల్స్ అక్కడక్కడే ఉండగా.. టాటా మోటర్స్, హోండా, ఎంజీ మోటర్ సేల్స్ పడిపోయాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, కియా కార్ల విక్రయాలు పెరిగాయి.
టూవీలర్ సెగ్మెంట్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఇంకా ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిల్లోనే నమోదవుతుండటం మార్కెట్ను దెబ్బతీసిందంటున్నారు. ఇక ఓవరాల్గా చూస్తే ఈసారి జూన్లో మొత్తం ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 3.67 శాతం పెరిగి 3,40,784 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు ఇదే నెల 3,28,710 యూ నిట్లుగా ఉన్నాయి.