న్యూఢిల్లీ, జూలై 3: దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన సెల్టోస్ ధరను పెంచుతున్నట్లు కియా ప్రకటించింది.
ఈ నెల నుంచే అమలులోకి వచ్చేలా సెల్టోస్ కార్ ధరను రూ.2 వేల నుంచి రూ.19 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో ఈ కారు రూ.10.90 లక్షల నుంచి రూ.20.37 లక్షలలోపు లభించనున్నది.