Infosys | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ నిబంధన ఉల్లంఘన విషయమై ‘సెబీ’కి రూ.25 లక్షలు చెల్లించేందుకు అంగీకరించింది. యూఎస్ బేస్డ్ గ్లోబల్ అసెట్ మేనేజర్ వాన్ గార్డుతో 2020 జూలైలో ఇన్ఫోసిస్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వాన్ గార్డు సంస్థకు ఇన్ఫోసిస్ క్లౌడ్ బేస్డ్ రికార్డ్ కీపింగ్ ప్లాట్ ఫామ్ అందిస్తుంది ఇన్ఫోసిస్. అయితే, సెబీ నిబంధనల ప్రకారం అన్ పబ్లిష్డ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్ఐ) నిబంధనను ఇన్ఫోసిస్ ఉల్లంఘించినట్లు తెలుస్తున్నది.
భారత్ లోని ఏ సంస్థ అయినా మరో సంస్థతో చేసుకునే ఒప్పందం ‘యూపీఎస్ఐ’ కింద చేసుకోవాల్సి ఉంటుంది. సెబీ ప్రోహిబిటెడ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ (పీఐటీ) రెగ్యులేషన్ ప్రకారం ఏ రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందమైనా సంబంధిత కంపెనీ స్టాక్ ధరపై ప్రభావం చూపరాదు. ఈ ఒప్పందాన్ని దుర్వినియోగం చేయరాదు. ఈ విషయమై ఇన్పోసిస్ సంస్థ యాజమాన్యానికి గతేడాది ఆగస్టులో సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. తదనుగుణంగా సెబీ ముందు ఇన్పోసిస్ కన్సెంట్ సెటిల్ మెంట్ పిటిషన్ దాఖలు చేసింది.
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !