న్యూఢిల్లీ, జూన్ 25: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్..మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకింగ్ సేవలను లాక్ చేసుకోవడంతోపాటు అన్లాక్ చేసుకునే సేవలను ప్రారంభించింది. ఇందుకోసం స్మార్ట్లాక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేవలతో బ్యాంక్ ఖాతాకు లాక్ లేదా అన్లాక్ చేసుకోవచ్చును. అలాగే యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి లావాదేవీలను కూడా నిలిపివేసుకోవచ్చును. ఫోన్ లేదా ఈ-మెయిల్ అవసరం లేకుండానే తమ ఖాతాకు సంబంధించిన అన్ని రకాల సేవలను నిలిపివేసుకోవచ్చును. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి నూతన సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఈ స్మార్ట్లాక్ ద్వారా ఖాతాదారుడు ఐమొబిలీ పే సేవలను నిలిపివేసుకోవచ్చునని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.