హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోఇంధన సామర్థ్య పరిష్కారాలను పెంపొందించడానికి ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో హైదరాబాద్కు చెందిన ప్రముఖ మహిళా వ్యాపారవేత్త వధ్య పద్మ ఒప్పందం కుదుర్చుకున్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మెరుగైన ఆర్థిక వృద్ధి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా నిలవడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎంవోయూతో రిటైల్ స్టోర్లను స్థాపించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సమర్థమైన ఇంధన సాంకేతికలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున రిటైల్స్టోర్లను విస్తరించాలని ఈఈఎస్ఎల్ లక్ష్యంగా పెట్టుకున్నది.