Food Market | న్యూఢిల్లీ, జూలై 3: దేశీయ ఆహార సేవల పరిశ్రమ అంచనాలకుమించి రాణిస్తున్నది. 2030 నాటికి ఈ రంగం రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్తంగా ‘హౌ ఇండియా ఈట్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అలాగే కస్టమర్లు 45 కోట్లకు చేరుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రూ.5.5 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నది. వచ్చే ఏడేండ్లలో ప్రతియేటా 10-12 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకుంటుందన్న సర్వే.. 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని వెల్లడించింది.