Tata Motors | దేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియాలతో పోటీ పడుతున్న టాటా మోటార్స్ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నది. 2030 నాటికి దేశీయ కార్ల మార్కెట్లో 18-20 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నది. 2030 నాటికి ఏటా దేశీయంగా 60 లక్షల కార్లు అమ్ముడవుతాయని టాటా మోటార్స్ అంచనా వేసింది. 2024-25 నుంచి 2029-30 నాటికి ఏయేటికాయేడు ఆరు శాతం కార్ల విక్రయాలు పెరుగుతాయని పేర్కొంది.
ఒకవైపు సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లు, మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తూ దేశీయ మార్కెట్లో తన వాటా పెంచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.
2027 నాటికి కార్పొరేట్ ఏవరేజ్ ఫ్యుయల్ ఎఫిషియెన్స్ (కేఫ్ 3) నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు శైలేష్ చంద్ర. అప్పటి కల్లా ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్జీ వాహనాల వాడకం రోజురోజుకు వృద్ధి చెందుతుందన్నారు. మరోవైపు సంప్రదాయ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుందన్నారు. వచ్చే ఐదారేళ్లలో కార్ల మార్కెట్లో పలు ట్రాన్షిషన్లు చోటు చేసుకుంటాయన్నారు. ప్రజలలో డిస్పోజబుల్ ఇన్ కం పెరగడంతోపాటు షార్టర్ వెహికల్ ఓనర్ షిప్ పీరియడ్ వంటి అంశాలు కార్ల కొనుగోళ్ల పెరుగుదలకు దారి తీస్తాయని చెప్పారు. గత కొన్నేండ్లుగా అదనపు కార్ల కొనుగోళ్లు పెరిగాయని, ఫస్ట్ టైం కార్ల కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతోందన్నారు.
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!