Stock Market | ముంబై, జూలై 1: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా ఆసియా, యూరోపియన్ సూచీలు లాభాల్లో ముగియడంతో దేశీయ మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 443.46 పాయింట్లు అందుకొని ఆల్-టైం హైకి 79,476.19 పాయింట్లకు చేరుకున్నది. 30 షేర్ల ఇండెక్స్లో 20 షేర్లు లాభపడగా, 10 షేర్లు నషాల్లోకి జారుకున్నాయి. మరో సూచీ నిఫ్టీ 24 వేల పాయింట్ల పైన ముగిసింది. 131.35 పాయింట్లు అందుకొని 24,141.95 వద్ద స్థిరపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.4,43, 05,344.036 కోట్లకు చేరుకున్నది.