ముంబై, జూలై 2: పరారీ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై తాజాగా మరో నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయ్యింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)కు రూ.180 కోట్ల రుణం ఎగవేశారన్న కేసులో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ ఎన్బీడబ్ల్యూకు ఆదేశించారు. 2007 నుంచి 2012 మధ్య మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఈ రుణాలను తీసుకున్నది.