BITS Pilani | ముంబై, జూలై 1: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ(బిట్స్ పిలానీ).. అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరిశోధనల కోసం ఐదేండ్లపాటు మాస్టర్ రిసెర్చ్ అగ్రిమెంట్(ఎంఆర్ఏ) సేవలు అందించడానికి మెర్సిడెస్-బెంజ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా(ఎంబీఆర్డీఐ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
డాటా, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రిక్ మొబిలిటీలపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ భాగస్వామ్యం కలిసొస్తుందని బిట్స్ పిలానీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రామ్గోపాల్ రావు తెలిపారు.
జీఎస్టీ.. 1.74 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ, జూలై 1: గత నెలకుగాను రూ.1.74 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.61 లక్షల కోట్ల కంటే ఇది 8 శాతం అధికం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు వరకు రూ.5.57 లక్షల కోట్ల మేర పన్నులు వసూలయ్యాయని తెలిపారు.
గెలాక్సీ ఏఐలో హిందీ
న్యూఢిల్లీ, జూలై 1: సామ్సంగ్.. తమ పాపులర్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ సిరీస్లో తెచ్చిన ఏఐ లాంగ్వేజ్ మాడల్స్కు హిందీని జత చేసింది. బెంగళూరులోని సామ్సంగ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్.. గెలాక్సీ ఏఐ కోసం ఈ హిందీ ఏఐ మాడల్ను అభివృద్ధిపర్చింది. ఈ మేరకు సోమవారం సంస్థ తెలియజేసింది.
ఎన్సీసీకి 335 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, జూలై 1: రాష్ర్టానికి చెందిన ప్రముఖ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గడిచిన నెలలో రూ. 335 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ ఆర్డర్లు బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చాయని తెలిపింది. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్లు లేవని పేర్కొంది.