Bharti Airtel | రిలయన్స్ జియో (Reliance Jio) బాటలోనే భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) ప్రయాణిస్తోంది. దాదాపు అన్ని రకాల ప్లాన్లపై 20 శాతం వరకూ చార్జీలు పెంచేసింది. పెంచిన చార్జీలు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఆయా ప్లాన్ల వ్యాలిడిటీని బట్టి ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సహా అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ల చార్జీలు 11-20 శాతం పెరిగాయి. గురువారం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ టారిఫ్ చార్జీలు 12-25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఇటు రిలయన్స్ జియో, అటు భారతీ ఎయిర్ టెల్ పెంచిన టారిఫ్ ధరలు జూలై మూడో తేదీ నుంచే అమల్లోకి రావడం గమనార్హం.
గతంలో డేటా యాడ్ ప్లాన్ కింద ఒక రోజు వ్యాలిడిటీతో ఒక జీబీ అదనపు డేటా కోసం రూ.19 చెల్లిస్తే ఇప్పుడు రూ.22 పే చేయాల్సి ఉంటుంది. ఒక రోజు వ్యాలిడిటీతో రోజూ 2 జీబీ అదనపు డేటా కోసం గతంలో రూ.29 చెల్లిస్తే ఇప్పుడు రూ.33 పే చేయాలి. బేస్ ప్లాన్ గడువుతో 4జీబీ డేటా అదనంగా అందించే ప్లాన్ కోసం ఇంతకుముందు రూ.65 పే చేస్తే ఇప్పుడది రూ.77లకు పెరిగింది.
గడువు – డేటా (జీబీ) – పాత చార్జీ (రూ) – పెంచిన చార్జీ (రూ)
28 రోజులు -2 – 179 – 199
28 రోజులు – 1 – 265- 299
28 రోజులు – 1.5 – 299 – 349
28 రోజులు – 2.5 – 359 – 409
28 రోజులు – 3 – 399 – 449
56 రోజులు – 2 – 549 – 649
84 రోజులు- 1.5 – 719 – 859
84 రోజులు – 2 – 839 – 979
84 రోజులు – 6 – 455- 509
365 రోజులు – 24 – 1799 – 1999
365 రోజులు – 2 – 2999 – 3599
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!