న్యూఢిల్లీ, జూన్ 26: ఐటీ సేవల సంస్థ ఎల్టీఐమైండ్ట్రీ చైర్మన్ పదవికి ఏఎం నాయక్ రాజీనామా చేశారు. దీంతో కంపెనీ నూతన చైర్మన్గా ఎస్ఎన్ సుబ్రమణ్యన్ నియమితులయ్యారు. బుధవారం కంపెనీ 28వ వార్షిక సాధారణ సమావేశంలో నాయక్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఎన్ సుబ్రమణ్యన్కు పదోన్నతి కల్పించింది. ఈ నెల 27 నుంచి ఈ నియామకం అమలులోకి రానున్నది.