హైదరాబాద్, ఆగస్టు 1: హైదరాబాద్-భువనేశ్వర్ల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. హైదరాబాద్లో ఉదయం 5.55 గంటలకు బయలుదేరనున్న సర్వీసు భువనేశ్వర్కు 7.20 గంటలకు చేరుకోనున్నది. మళ్లీ 8.20 గంటలకు బయలుదేరి హైదరాబాద్కు 9.45కి చేరుకోనున్నది.
అమర రాజాతో ఏథర్ జట్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: బ్యాటరీ సెల్స్ తయారీ, సరఫరా కోసం ప్రముఖ ఈవీల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తాజాగా అమర రాజా అడ్వాన్స్ సెల్ టెక్నాలజీతో జట్టుకట్టింది.ఈ ఒప్పందంలో భాగంగా ఎన్ఎంసీ(నికేల్ మాంగనీస్ కోబాల్ట్), ఎల్ఎఫ్పీ(లిథియం ఐరన్ ఫాస్పెట్) లిథియం-అయాన్, ఇతర అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్లను అమర రాజా సరఫరా చేయాల్సి ఉంటుంది.