హైదరాబాద్, జూలై 3: గ్లాస్ ఉత్పత్తుల సంస్థ ఏజీఐ గ్రీన్ప్యాక్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్, భువనగిరి, ఇస్నాపూర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి రూ.230 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ సీఈవో రాజేశ్ ఖోస్లా తెలిపారు.
అలాగే మధ్యతూర్పు, యూరప్ దేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఎగుమతులను పెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన భువనగిరి ప్లాంట్లో ప్రస్తుతం రోజుకు 154 టన్నుల గ్లాస్ ఉత్పత్తి అవుతున్నదని, నూతన టెక్నాలజీ కోసం ఆర్అండ్ డీ సెంటర్ను కూడా మరింత బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. 160 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్తో 2,400 మందికి ఉపాధి లభిస్తున్నాయి.