SBI Card | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు `ఎస్బీఐ` అనుబంధ ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా అభిజిత్ చక్రవర్తి నియమితులయ్యారు. అభిజిత్ చక్రవర్తిని సీఈఓగా తమ మాతృ సంస్థ ఎస్బీఐ నియమించిందని ఎస్బీఐ కార్డ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. ఎస్బీఐ కార్డ్ సీఈఓగా అభిజిత్ చక్రవర్తి రెండేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
వచ్చేనెల 11న ప్రస్తుత ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ రావు రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో ఆగస్టు 12న అభిజిత్ చక్రవర్తి బాధ్యతలు స్వీకరిస్తారు. 1988లో ట్రైనీ ఆఫీసర్గా ఎస్బీఐలో చేరిన అభిజిత్ చక్రవర్తి ప్రస్తుతం బ్యాంకు డిప్యూటీ ఎండీగా ఉన్నారు.