ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫలితాల ప్రభావంతో జరిగిన భారీ షార్ట్ కవరింగ్తో 2 వారాల శ్రేణి నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ సాధించింది. 21,928 పాయింట్ల కొత్త స్థాయిని తాకిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 184 పాయింట్లు లాభపడి 21,895 వద్ద ముగిసింది. డిసెంబర్ 28 నుంచి 21,500-21,800 శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నదని, శుక్రవారం 21,800 స్థాయిని బేర్స్ నుంచి బుల్స్ చేజిక్కించుకున్నారని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది చెప్పారు. అయితే రెలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ బేరిష్ డైవెర్జన్స్ ప్రదర్శిస్తున్నదని, వీక్లీ చార్టు ల్లో నిఫ్టీ బలహీనతను సూచిస్తున్నదని హెచ్చరించారు. డెయిలీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్ల్లో బ్రేక్అవుట్ జరిగినందున, ఈ వారం పెరిగే అవకాశం ఉన్నదని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ అంచనా వేశారు.
మద్దతు 21,750-21,800
గత రెండు వారాల శ్రేణిలో అప్పర్బ్యాండ్ 21,800 స్థాయిని చేధించినందున, ఈ వారం ఇదే స్థాయి తక్షణ మద్దతుగా నిలుస్తుందని జిమిత్ మోది విశ్లేషించారు. తదుపరి కొనుగోళ్లతో 22,000కు వెళ్లవచ్చన్నారు. ఆపై మరింత ర్యాలీకి వీలుందన్నారు. ఆప్షన్ రైటింగ్ యాక్టివిటీ ప్రకారం ఈ వారం తొలుత 22,000 పాయింట్ల వద్దకు చేరవచ్చని, దీన్ని బలంగా దాటితే 22,200 పాయింట్లను అందుకోవచ్చని రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. 21,750 పాయింట్ల స్థాయి వద్ద లభించబోయే మద్దతు మార్కెట్కు కీలకమని చెప్పారు.