అమరావతి : ఏపీలో శాంతి భద్రతలు (Law and Order) కరువయ్యాయని ఆరోపిస్తూ అధికార టీడీపీ (TDP ) నాయకులపై వైసీపీ నాయకులు శనివారం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ (YCP) సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఆధ్వర్యంలో మరికొందరు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir) నుకలిసి వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు అరాచకాలకు, దాడులకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తుందని వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు స్థలాల కేటాయింపు, భవన నిర్మాణాలు(Party Buildings) జరిగాయో అదే తరహాలో వైసీపీ ప్రభుత్వం పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం నిర్మించిన పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓట్లు వేసి దళితులపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని గవర్నర్ను కోరామని వివరించారు. అధికార తీరు హర్షణీయంగా లేదని అన్నారు.