అమరావతి : అచ్యుతాపురం సెజ్ (Achuthapuram SEZ ) బాధితులకు వైసీపీ తరఫున ఆర్థిక సహయం (Financial assistance ) అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Former minister Botsa) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడ్డవారికి రూ. 2 లక్షల చొప్పున అందజేస్తామని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ స్థానిక నాయకులు స్వయాన బాధితుల వద్దకు వెళ్లి సహాయాన్ని అందజేస్తారని తెలిపారు.
అనకాపల్లి ఫార్మా కంపెనీ (Pharma Company) ప్రమాదంలో 17 మంది చనిపోయారని, ఇది ఎంతో బాధాకరమైన సంఘటనని పేర్కొన్నారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదని విమర్శించారు. విషాదకర ఘటనపై రాజకీయాలు చేయవద్దని సూచించారు. ఎసెస్షీనియా ఫార్మా కంపెనీలో సేఫ్టీ ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు వైసీపీ వ్యతిరేకం కాదని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో విశాఖలో పరిశ్రమల సెజ్ను తామే ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. పరిశ్రమలో జరుగుతున్న ఘటనలు పునరావవృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు.
వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధప్రాతిపదికన స్పందించి సహాయక చర్యలు చేశామని , బాధితులకు కోటి చొప్పున అందించామని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని వైసీపీ ప్రశ్నించిన తరువాతనే సీఎం కేజీహెచ్కు వచ్చారని విమర్శించారు.