హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్కల్యాణ్కు భద్రత పెంచారు. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ప్రూఫ్ కారును కేటాయించారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్కల్యాణ్ బుధవారం ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా మంగళవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు, కూటమి నాయకులు, ఉద్యోగులు పవన్ కల్యాణ్కు ఘనస్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.