ఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra Babu) ను ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్టు (Arrest) చేయలేదని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee ) లోక్సభ(Lok Sabha) ను ప్రశ్నించారు. మంగళవారం జరిగిన లోక్సభా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబుపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రాల్లోని అవినీతి పార్టీలతో చేతులు కలిపిందని ఆరోపించారు. చంద్రబాబు, ప్రపుల్ పటేల్, అజిత్ పవార్ లాంటి నేతలతో చేతులు కలిపి కేసులను పెండింగ్లో పెట్టారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారని,ఇందులో భాగంగా టీడీపీ ముఖ్య నాయకుడు షేర్లు కొనుగోలు చేసి ఒకేరోజులో రూ. 521 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ ఎంపీ ఫిర్యాదు
ఏపీలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై దాడులు చేస్తుందని అరకు ఎంపీ తనూజారాణి ((YCP MP Tanuja rani) రాష్ట్రపతి(President) ద్రౌపదిముర్ముకు మంగళవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.