అమరావతి : ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasrao ) విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కార్యకర్తలు ఏమీ ఆశీంచకుండా కార్యకర్తలు చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. గత పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారి లెక్క తేలాల్సిన అవసరముందని వెల్లడించారు.
రాజకీయ ప్రేరేపిత కేసులను టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసుల(Police cases) ను మూడు నెలలో తొలగిస్తామని అన్నారు. బాధ్యతగా పనిచేస్తానని, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఎన్టీఆర్(NTR) ఆలోచనలనుకుణంగా, నాయకుల ఆదేశాల మేరకు పార్టీ నాయకులు కృషి చేయాలని కోరారు.
అధికారంలో ఉన్నామని ప్రజాస్వామానికి విఘాతం కలిగించే పనులు ఏవి చేయవద్దని సూచించారు. వైసీపీ(YCP) పాలనలో ప్రతిపక్షాన్ని అణగదొక్కారని, దాడులకు పాల్పడ్డారని , వ్యక్తిగత హననానికి దిగి అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోక పోవడం వల్లే వైసీపీని ప్రజలు ఇంటికి పంపించారని తెలిపారు .