అమరావతి : ఏపీలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు (IPS Tranfers) బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది. విశాఖ సీపీ(Visaka CP) గా పనిచేస్తున్న రవిశంకర్ అయ్యన్నార్ (Ravi Shanker) ను సీఐడీ అదనపు డీజీగా బదిలీ చేశారు.
ఏపీఎస్పీ (APSP Battalion ) బెటాలియన్ అదనపు డీజీగా పనిచేస్తున్న అదనపు డీజీ అతుల్ సింగ్(Atul Singh) ను ఏసీబీ డీజీగా నియమించారు. ప్రస్తుతం శాంతి భద్రతల అదనపు డీజీగా ఉన్న శంకబ్రత బాగ్చీని విశాఖ సీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.