అమరావతి : ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పులి పిల్ల (Tiger cub) మృతి చెందింది. అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు జిల్లాలోని రామభద్రాపురం మండలం తారాపుత్రం వద్ద రోడ్డును దాటుతున్న పులిపిల్లను అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ పులిపిల్ల అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు(Police), అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పులిపిల్ల కళేబరాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పులిపిల్ల వయస్సు 2 సంవత్సరాలు ఉంటుందని అటవీ అధికారులు(Forest Officials) చెప్పారు. కేసు నమోదు చేసుకుని గుర్తు తెలియని వాహనం ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు. అడవి జంతువుల సంచారం ఉన్న రహదారులపై వాహనదారులు అతివేగంగా వాహనాలను నడపవద్దని అధికారులు కోరారు.