Minister Narayana | ఏపీలో నిధుల కొరత చాలా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం నుంచి రూ.27వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. 17వేల కోట్లు కేంద్రం, 17 వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు నిలిపివేశారని చెప్పారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్లో నూతనంగా నిర్మించిన జిమ్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ తరఫున నిధులు రావాల్సి ఉందన్నారు.
రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు ఆగిపోయాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీజేఎంఎస్లో రూ.19 కోట్లు కాగితాల్లో ఉన్నాయని.. డబ్బు మాత్రం లేదని పేర్కొన్నారు. ఆ నిధులు మొత్తం ఇతర అవసరాలకు మళ్లించేశారని అన్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు తమకు ఎదురవుతున్నాయని తెలిపారు. సీఎం సహకారంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.