అమరావతి : కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకా హత్య కేసు (Viveka murder case) లో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ గంగన్న(Wathman Ganganna) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస వ్యాధితో ఇబ్బందిపడుతున్న గంగన్న కు పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడిని కడప రిమ్స్(Kadapa RIMS) కు తరలించారు.
2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల నివాసంలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు కేసులో నిందితులను గుర్తించి జైలుకు పంపగా వారు ప్రస్తుతం కొందరు బెయిల్పై బయట ఉన్నారు. కేసులో నిందుతుల్లో ఒకరైన అవినాష్రెడ్డి కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మరోసారి గెలుపొందారు. మరో నిందితుడైన దస్తగిరి అప్రూవర్గా మారారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.