తిరుపతి : తిరుపతి (Tirupati) లోని కోదండరామాలయంలో జులై (July month) నెలలో జరిగే పలు విశేష ఉత్సవాల (Special festivals) వివరాలను టీటీడీ వెల్లడించింది. జులై 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవను అర్చకులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు.
5న అమావాస్య సందర్భంగా ఉదయం సహస్ర కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ, 6న పునర్వసు నక్షత్నరం సందర్భంగా ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారని చెప్పారు. 16న ఆణివార ఆస్థానం, 21న పౌర్ణమి సందర్భంగా ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, 30 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పవిత్సోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 69,632 మంది భక్తులు దర్శించుకోగా 30,179 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ( Hundi Income) కి రూ. 3.32 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.