అమరావతి : విభజన హామీల (Division problems) పరిష్కారానికి సమావేశాన్ని కోరిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandra Babu) ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వాగతించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ చంద్రబాబుకు లేఖ(Letter) రాశారు.
ఈ నెల 6న సాయంత్రం హైదరాబాద్లోని ప్రజాభవన్ (Prajabavan) లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. విభజన చట్టం పెండింగ్ సమస్యలకు పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరమని వెల్లడించారు.