అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల (MLCs) ఎన్నికలకు మంగళవారం కూటమి అభ్యర్థులు నామినేషన్లు (Nominations) దాఖలు చేశారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్ (Hari prasad) నామినేషన్లు వేశారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరుగనుంది.
జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. శాసనసభలో ఎన్డీయే కూటమికి ఉన్న సంఖ్యాబలం చూస్తే ఎమ్మెల్సీలగా వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.