తిరుపతి : తిరుపతిలోని అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) మంగళవారం రాత్రి ముగిసాయి. పదిరోజుల పాటు వైభవంగా కొనసాగిన ఉత్సవాల్లో స్వామివారు ప్రతిరోజు వాహనంపై ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
చివరి రోజు మంగళవారం స్నపన తిరుమంజనం (Snapana Thirumanjanam) చేపట్టి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం నవసంధి, మాడవీధి ఉత్సవాన్ని, ధ్వజావరోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. కార్యక్రమంలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ బట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.