అమరావతి : పోలవరం, అమరావతి రాజధాని రెండు కళ్లులాంటివని ఏపీ సీఎం(AP CM) చంద్రబాబు (Chandra Babu) అన్నారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు(Polavaram) పై మొదటి శ్వేతపత్నాన్ని (White Paper) నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేత పత్రం విడుదల చేస్తామని, మొత్తం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేస్తామని అన్నారు. వెబ్సైట్ల (Website) ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదలని స్పష్టం చేశారు.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకముందే రాష్టంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్రానికి నివేదిక ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాడుతో సవాళ్లు అధిగమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహామని పేర్కొన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టం ఎక్కువని వెల్లడించారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా వైఎస్ జగన్ (YS Jagan) అహంభావంతో పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి రివర్స్ టెండర్స్కు వెళ్లారని విమర్శించారు. జగన్ వల్ల డయాఫ్రంవాల్ దెబ్బతిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరంపై రూ. 11,762 కోట్లు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు.