అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక చర్చ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) కోరారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద లోతైన చర్చ జరగాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.
శాంతి భద్రతల(Law and Order) పై ప్రభుత్వం తీసుకునే భవిష్యత్ ప్రణాళిక , చట్టం అంటూ భయం వచ్చే విధంగా ఉండాలని పేర్కొన్నారు. చర్చల్లో సభ్యులందరి సూచనలు తీసుకొని 5 కోట్ల మంది ప్రజల భద్రత కలిగించేలా ఉండాలని అన్నారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) శాంతి భద్రతల్లో తలమానికంగా ఉండేలా విస్తృతస్థాయి చర్చ జరిగి విధి, విధానాల రూపకల్పన చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకరోజు శాంత భద్రతల అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. నేరాలను అరికట్టేందుకు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని అన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టవంతం చేయాల్సిన అవసరముందని అన్నారు.
గత వైసీపీ పాలనలో ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానికంపై రాజకీయ ప్రేరేపితంగా పెట్టిన కేసులను విచారించి చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని గౌరవించాలని అన్నారు. కూటమి సభ్యులు ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటివారిపైనా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేయనని చంద్రబాబు వెల్లడించారు.
Read more :
Chandrababu | జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత లేదు : ఏపీ సీఎం చంద్రబాబు