అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా(Special status) అనేది ప్రజల హక్కు అని, ఆ అవకాశాన్ని టీడీపీ ఉపయోగించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి (MP YV Subbareddy) సూచించారు. మంగళవారం రాష్ట్రపతి(President) ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాలని సూచించారు. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశముందని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్షపూరితంగా దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.
పోలవరం (Polavaram) ప్రాజెక్టు పూర్తికి కేంద్ర సహయం తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు తగిన గనులు కేటాయించి లాభాల బాటలోకి తీసుకురావాలన్నారు. విశాఖ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం (Bhogapuram) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేయాలని కోరారు.