హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుతూ గురువారం ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడు పవన్కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ చేశారు. పవన్ ఎన్నికల్లో గెలవడంతో తన సవాల్కు కట్టుబడుతూ పేరు మార్పునకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన పేరును మార్చుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు.