అమరావతి : దేశంలో ఎన్నికల ఎగ్జిట్పోల్స్ ( Exit Polls) పలు పార్టీలకు షాక్ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బిగ్ షాక్ను ప్రకటించాయి. ఏపీలో వైసీపీ(YCP), కూటమి తరుఫున టీడీపీ(TDP), బీజేపీ, జనసేన(Janasena) పోటీ చేయగా కాంగ్రెస్(Congress) పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది.
శనివారం సాయంత్రం ఎగ్జిట్పోల్స్లో కూటమి అధికారంలో వస్తుందని కొన్ని సర్వేలు, తిరిగి వైసీపీ అధికారంలో రానుందని మరికొన్ని సర్వేలు చెబుతుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఒకటి రెండు సర్వేలు అధికార, కూటమి మధ్య హోరాహోరి ఉంటుందని ప్రకటించాయి.
అయితే ఈ సర్వేలన్నీ కూడా రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్కు పార్లమెంట్లో, అసెంబ్లీలో సీట్లు రావని తేల్చి చెప్పాయి. ఏపీ విభజన అనంతరం 2014, 2019లో కాంగ్రెస్ ఒక్క సీటును సాధించలేక పోగా 2024 ఎగ్జిట్పోల్స్ కూడా సీట్లు రావని ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు నిరాశలో ఉన్నారు.