అమరావతి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో శనివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది . ఆర్ఎంహెచ్పీ డిపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగవ్యాపించడంతో ఇబ్బందులు పడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ప్లాంట్ లోని రెండు కన్వేయర్ బెల్టులు ఢీ కొనడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.