అమరావతి : ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) గురువారం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టేముందు ఆయన విశ్వంభర (Viswambara ) సెట్స్కు వెళ్లి చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వంభర సెట్స్లో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని, మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని స్వయంగా మంత్రి ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
విశ్వంబర సెట్స్లో దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) తో పాటు మూవీ యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన(Janasena) 21 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా 21 స్థానాల్లోనూ విజయం సాధించి దేశ చరిత్రలో సరికొత్త రికార్డును సాధించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా 21 స్థానాల్లోనూ విజయం సాధించి దేశ చరిత్రలో సరికొత్త రికార్డును సాధించారు. కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.