అమరావతి : వాల్తేరు డివిజన్ (Waltheru division ) పరిధిలో ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 5,6వ తేదీల్లో పలు రైళ్లను రద్దు ( Trains Cancell ) చేసినట్లు ఆ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ వెల్లడించారు. ఈ నెల 5న పలాస-విశాఖ (07471), విశాఖ-పలాస(07470), విశాఖ-భవానీపట్నం(08504), విశాఖ- బ్రహ్మపుర(08532), విశాఖ-గుణుపూర్(08504), గుణుపూర్-విశాఖ (08521) ప్యాసింజర్ రైళ్లను , విశాఖ-భువనేశ్వర్(22820) ఇంటర్సిటీ రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. 6వ తేదీన భువనేశ్వర్-విశాఖ(22819) ఇంటర్సిటీ, భవానీపట్నం(08503), బ్రహ్మపుర- విశాఖ(08531) పాసింజర్ రైళ్లను రద్దు చేశామని ఆయన వివరించారు.